Sunday, February 28, 2010

అదన్నమాట!: ఫిబ్రవరి 21-27

ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమి లేవు.

కేసీఆర్ గారు ఏమో ఇప్పుడు అప్పుడే రాజీనామా చెయ్యరు అంట. ఎందుకు ఏమిటి అని అడగద్దు. అదీ అంతే! అయన చెయ్యకపోతే విజయశాంతి గారు ఎందుకు చేస్తారు అండి మరి ? ఇది ఇలా ఉండగా, రాజీనామా చేసిన పన్నెండు ఎమ్యెల్యేలు మళ్ళి పోటి కి దిగుతారు అంట ... వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అంట! రాజీనామా చెయ్యడం ఎందుకు ? మళ్ళి అసెంబ్లీ లోకి రావడానికి పోటి చెయ్యడం ఎందుకు అండి? అసలు ఇది ఏమి అన్యాయం అండి? ప్రజల సొమ్ము అంటే ఇంత చులకన అయ్యిపోయింద ఈ నాయకులకి ? ఏకగ్రీవంగా అస్సలు ఉండకూడదు. పోటి ఉండాలి. ఈ తీఆరఎస్ ఎమ్యెల్యేలు దారున్గా ఓడిపోవాలి. అదీ నా కోరిక. కొంచం కూడా సిగ్గు లేకుండా పోతుంది వీళ్ళకి. ఇంతోటి దానికి రాజీనామాలు చేసి పడవలు త్యాగం చేసాం అని చెప్పుడ్కోవడం ఎందుకు ?!

ఇది ఇలా ఉండగా, బడ్జట్ సమావేశాలు కొంచం ప్రశాంతంగా సాగుతునాయి. చర్చలు జరుగుతునాయి అసెంబ్లీ లో. ఈ తెరాసా ఎమ్యెల్యేలు లేకపోతె ఇంత ప్రసాంతంగా ఉంటుంది అని ముందే తెలిసి ఉంటె బాగుండేది ! రోశయ్య గారు ఏమో తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇప్పుడు అప్పుడే సాధ్యం కాదు అని చెప్పేశారు. ఇదే మాట యైఎసార్ కూడా అప్పుడు చెపారు, మళ్ళి ఇప్పుడు రోశయ్య గారు అదే మాట చెప్పారు.

రాజ్య సభ కి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మన రాష్ట్రం లో ఆరు సీట్లు కి ఎన్నికలు. ఇందులో రెండు తెదేప కి, నాలుగు కాంగ్రెస్స్ కి వెళ్తాయి. కాని చిరంజీవి గారు కాంగ్రెస్స్ తో మంతనాలు జరుపుతున్నారు అంట, అల్లు అరవింద్ ని రాజ్య సభ కి పంపడానికి. ఇది ఒక్క దరిద్రం మిగిలింది ఆ పార్టీ కి ... అదీ కూడా పూర్తీ చేస్తే బాగుంటది అని ఈ ఆలోచన వచ్చింది ఏమో చిరంజీవి కి !

1 comments:

Arun said...

Irrigation projects in Andhra under PMO scanner
Irrigation projects in Andhra Pradesh (AP) involving a combined outlay of Rs1.8 trillion have come under the scrutiny of the Prime Minister’s Office (PMO) following corruption charges by opposition parties in the southern state.

Post a Comment