Sunday, May 16, 2010

అదన్నమాట! :మే 9-15

ఎం ఎండలు అండి బాబు. మాడ్చేస్తునాయి రాష్ట్రాన్ని ! రాజకీయ వేడి కూడా అలానే ఉంది లెండి. చంద్రబాబు గారు, రోశయ్య గారు ఒకరినొకరు తెగ తిట్టుకున్నారు ఈ వారం లో. సాక్షి పత్రిక అయితే ఇంకా పూర్తి గా రోశయ్య సర్కారు ని దిమ్పెదాము అనే అగెండా తోనే ఉన్నట్టు ఉంది. మాట్లిడితే చాలు, వై ఎసార్ ప్రవేసపెట్టిన సంక్షేమ పధకాలు అమలు ఆపేస్తున్నారు అని మొర పెట్టుకుంటుంది ఈ పత్రిక ! ఇది ఇలానే సాగితే, నాయుడు గారు కేవలం ఆ పత్రిక ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చదివి వినిపిస్తే చాలు.... మరి ఇంకేం ప్రచారం చేయ్యనాకర్ లేదు !

గత వారం లో హైదరాబాద్ లో ఒక కాన్స్టేబుల్ ని దుండగులు కాల్చి చంపారు. గత మూడు ఏళ్ళల్లో ఇలా జరగడం మూడో సారి. మక్కా మజీదు లో పేలుడు జరిగి మూడు ఏళ్ళు కావస్తుంది. ప్రతి ఏడాది, ఇలా దుండగులు పేలుడు జరిగిన డేట్ కి దగ్గరలో ఒక పోలీస్ ని చంపేస్తున్నారు. ఆయినా సరే, మన పోలీసులు కి కనీసం తుపాకులు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. చనిపోయిన రమేష్ తో పాటు ఇంకో నలుగురు పోలీసులు ఉన్నారు అక్కడే. ఎవ్వరి దగ్గర కు తుపాకులు లేవు. ఇదే అదును చూసుకుని, దుండగులు వచారు, కాల్చారు, పారిపోయారు.

0 comments:

Post a Comment