Sunday, August 15, 2010

అదన్నమాట! : ఆగస్ట్ 8-14

44000 ఎకరాల మేరకు పంట నష్టం జరిగినా, ఈ వారం అంతా మన మీడియా వాళ్ళు , వాళ్ళ మధ్యే కొట్టుకోవడం లో సరిపోయింది. ఈనాడు ఏమో జగన్ ని ఆరేసింది. సాక్షి ఏమో రామోజీ గారిని వేసుకుంది. ఇది ఇలా ఉండగా, అంబటి రాంబాబు గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ కొంత మంది కాంగ్రెస్ నేతలే పత్రికలకి వివరాలు ఇచ్చినట్టు ఉన్నారు. ఇది ఇలా ఉండగా, ఇది కేవలం కాంగ్రెస్స్ పార్టి అంతర్గత కుమ్ములాట అని , ప్రజలు పెద్దగా ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కొంత మంది నాయకులు సెలవిచ్చారు. మధ్యలో అంబటి రాంబాబు గారు మళ్ళి వచ్చి, రోశయ్య ప్రభుత్వం అసమర్ధ ప్రభుత్వం అని చెప్పారు. రాష్ట్రం లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాని ఇప్పుడు వైఎసార్ గారు లేరు కదా , అందుకే రాష్ట్రానికి మంచి జరుగుతున్నా, కాంగ్రెస్స్ నాయకులే చూసి ఒర్వలేకపోతున్నారు! మర్చిపోయారు ఏమో - 44000 ఎకరాల మేరకు పంట నష్టం జరిగింది రాష్ట్రం లో. అదన్నమాట!

0 comments:

Post a Comment